బాబాకు సచిన్ దంపతుల నివాళి

పుట్టపర్తి : సత్యసాయి బాబాకు సచిన్ టెండుల్కర్ దంపతులు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం సచిన్ దంపతులు చాముండేశ్వరీనాథ్‌తో కలిసి పుట్టపర్తి వచ్చారు. కుల్వంత్ హాల్‌లోని బాబా పార్థివ దేహాన్ని చూసి చలించిపోయిన సచిన్ కంటతడి పెట్టారు. సచిన్, ఆయన భార్య అంజలి బాబాను దర్శించుకున అక్కడే కుర్చుని ప్రార్థన చేశారు. బాబాతో సచిన్‌కు ఎనలేని అనుబంధం ఉంది. తరచు పుట్టపర్తి వచ్చి బాబాను దర్శించుకునేవారు. కాగా ప్రముఖ గాయని సుశీల బాబా భౌతికకాయాన్ని దర్శించి భోరున విలపించారు. కేంద్రమంత్రులు విలాస్ రావ్ దేశ్ ముఖ్, ప్రపుల్ పటేల్ లు కూడా ఈరోజు ఉదయం సాయి భౌతిక కాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu