రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవోకీ కరోనా
posted on Jun 1, 2020 8:35PM
కరోనా వైరస్ బారిన పడుతున్న బాలీవుడ్ ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. షారుఖ్ ఖాన్ స్నేహితుడు, నిర్మాత కరీమ్ మొరానీ ఫ్యామిలీ కోలుకుందని సంతోషించేలోపు... నటుడు కిరణ్కుమార్ కరోనా బారిన పడ్డారు. ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ మృతి చెందారు. ఓ షాక్ నుండి కోలుకోకముందే మరో షాక్ తగులుతోంది. లేటుస్టుగా కరోనా బారిన పడ్డ ప్రముఖుల్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో షిబాసిష్ సర్కార్ చేరారు. ఆయన ముంబైలోని కోకిలాబెన్ హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలో కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. అక్షయ్కుమార్, రోహిత్శెట్టి కాంబినేషన్లో ‘సూర్యవంశీ’, ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ వరల్డ్ కప్ అందుకున్న 1983 సంఘటన మీద తెరకెక్కుతున్న ‘83’ సినిమాలకు షిబాసిష్ సర్కార్ క్రియాశీలకంగా పని చేశారు.