రాయపాటి సంచలన వ్యాఖ్యలు

గుంటూరు: గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల కంటే రాజకీయాల్లో ఇప్పుడు సంపాదన బాగా పెరిగిందని ఆయన చెప్పారు. రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు డబ్బు తీసుకొని ఓట్లు వేసినంత కాలం.. వ్యవస్థ ఇలాగే ఉంటుందన్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసే ప్రజాప్రతినిధులు.. గెలిచాక తిరిగి ఆ డబ్బును సంపాదించుకోవడం పైనే దృష్టి పెడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తనకు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఖర్చయినట్లు రాయపాటి తెలిపారు. 2014లో జరిగే ఎన్నికలకు రూ.100 కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు రూ. వందల కోట్లను అక్రమంగా సంపాదిస్తున్నారని రాయపాటి ఆరోపించారు. కాగా, సాయిబాబా ప్రవేశపెట్టిన సేవలన్నింటినీ కొనసాగించేందుకు వీలుగా.. రూ.లక్షల కోట్ల ఆస్తులున్న సత్యసాయిబాబా ట్రస్ట్‌ను సర్కారు స్వాధీనం చేసుకోవాలని కోరారు. సాయి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరూ.. బాబా చూపిన మార్గంలోనే నడవాలని రాయపాటి కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu