ముగిసిన రాహుల్ యూరప్ టూర్.. పార్టీ నేతలతో సమావేశం..
posted on Jan 11, 2016 9:29AM
.jpg)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తాను యూరప్ పర్యటనలో ఉండగా జరిగిన పరిణామాలేమిటి అన్నదానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు నిమిత్తం దాదాపు రెండు నెలల వరకూ విశ్రాంతి తీసుకున్న సంగతి విదితమే. అయితే అప్పుడు అతని అజ్ఞాతంపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విమర్శల బాణాలు సంధించాయి. దీంతో ఈసారి కూడా అలానే జరుగుతుందని రాహుల్ ముందుగానే ఊహించుకొని ఉంటారు.. అందుకే డిసెంబర్ 28న తాను యూరప్ పర్యటనకు వెళ్తున్నట్టు ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. ఆయన కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకొన్నారు. మొత్తానికి రాహుల్ బానే ముందు జాగ్రత్త తీసుకున్నారు.