ప్రణబ్ దాదాకి గ్రాండ్ ఫెర్‌వేల్

రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనుండటంతో ప్రభుత్వం ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రణబ్‌ను ఘనంగా సత్కరించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీల సంతకాలతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్‌కు సుమిత్రా మహాజన్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..1969లో ఎంపీగా పార్లమెంటుకు వచ్చినప్పటి నుంచి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని..రాజకీయ నాయకుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ప్రశంసించారు.