సాయి ట్రస్టుకు నాగిరెడ్డి హెచ్చరిక

అనంతపురం: శ్రీ సత్య సాయి ట్రస్టుపై తాను హైకోర్టుకు వెళ్తానని మాజీ మంత్రి నాగిరెడ్డి హెచ్చరించారు. ప్రశాంతి నిలయంలోని యజర్మందిరాన్ని అధికారుల సమక్షంలోనే తెరవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. యజుర్ మందిరంలోని కానుకలను గోప్యంగా ఉంచరాదని ఆయన అన్నారు. యజర్ మందిరంలో ఏయే కానుకలున్నాయో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంతి నిలయానికి సంబంధించి వివరాలు అందించాలని తాను సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేశానని, ఇప్పటి వరకు సమాధానం రాలేదని, 30 రోజుల్లోగా సమాధానం రాకపోతే హైకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu