గడువు పెడితే మేము రెడీ

హైదరాబాద్: తెలంగాణ జెఎసి గడువు పెడితే తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ చెప్పారు. గడువు పెట్టాలని ఆయన జెఎసిని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన అల్పాహార విందుకు సోమవారం హాజరైన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి మంత్రి డికె అరుణ నాయకత్వం వహించాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేవారు ద్రోహులవుతారని ఆయన వ్యాఖ్యానించారు. జూపల్లి కృష్ణారావు చేపట్టిన పాదయాత్ర ప్రజాస్వామ్య హితమైందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వెనక నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu