ప్రభాస్ పదమూడు సంవత్సరాల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్(raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత ప్రభాస్(prabhas)నుంచి రాబోయే మూవీ కూడా ఇదే. పైగా ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ కామెడీ  జోనర్ ని టచ్ చేస్తుండంతో  అభిమానుల తో పాటు ప్రేక్షకుల్లో కూడా రాజా సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే  సీతారామం ఫేమ్ హను రాఘవపూడి(hanu raghavapudi)డైరక్షన్ లో  సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇటీవలే పూజా కార్యక్రమాలతో అధికారంగా ప్రారంభమవ్వగా ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో  ఉంది. ఇప్పుడు ఈ మూవీకి చెందిన తాజా న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
 
ప్రభాస్ సరసన సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన ఇమాన్వీ(imanvi)హీరోయిన్ గా చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ని సంపాదించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు  ఈ మూవీ సెకండ్ హీరోయిన్ కి కూడా చోటు ఉందనే వార్తలు వినిపిస్థున్నాయి. కథ ప్రకారం ఆ క్యారక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందని, అసలు ఇప్పటికే రెండో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందని అంటున్నారు. సరైన టైం చూసి మేకర్స్ ఆమె పేరుని అనౌన్స్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. 

ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ నుంచి కల్కి వరకు స్క్రీన్ పై ఇద్దరు భామలతో జత కట్టిన సందర్భాలు చాలా తక్కువ. మిస్టర్ పర్ఫెక్ట్ లో మాత్రమే ఇద్దరు భామలతో రొమాన్స్ చేసాడు. 1940 నాటి చారిత్రక నేపథ్యం ఉన్న కథ తో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ సైనికుడి పాత్రలో చేస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జట్ తో నిర్మిస్తుంది. అందరి అగ్ర హీరోలందరితో సినిమాలు నిర్మించిన ఆ సంస్థ  ఫస్ట్ టైం ప్రభాస్ తో చేస్తుండంతో  ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా  రాజీ పడటంలేదు.