శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

 

పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు అర్ధరాత్రి నుండి మళ్ళీ భారీగా పెరగబోతున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ. 3.13, డీజిల్ పై లీటరుకు రూ. 2.71 చొప్పున ధరలు పెరగబోతున్నాయి. మొత్తం మీద చూసుకొన్నట్లయితే కేవలం ఈ రెండు వారాల వ్యవధిలో పెట్రోలు మీద లీటరుకి రూ.7.09, డీజిల్ మీద లీటరుకి రూ.5.08 పెరిగినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయినప్పటికీ ఆ లాభాన్ని నేరుగా ప్రజలకు అందజేయడానికి ఆయిల్ సంస్థలకు కానీ ప్రభుత్వాలకు గానీ మనసొప్పలేదు. కానీ ప్రజల నుండి వస్తున్న తీవ్ర విమర్శల వల్లనయితేనేమి లేక రాజకీయ ఒత్తిడి వల్లనయితేనేమి గతేడాది 2014 అక్టోబర్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు పది విడతల్లో పెట్రోల్ పై లీటరుకి రూ. 17.11, డీజిల్ పై 12.96 తగ్గించారు. కానీ ఇప్పుడు కేవలం రెండు వారాల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. బహుశః మరొకటి రెండు నెలల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను మళ్ళీ పెంచుకొంటూపోయి, ఇదివరకున్న ధరలకే చేర్చుతాయేమో ఆయిల్ కంపెనీలు?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu