నిర్మాతపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు..

హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రముఖ సినీ నిర్మాతపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 'అత్తారింటికి దారేది' సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పై పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఆయన మాట తప్పారని.. సినిమా సమయంలో ఆయన తనకు కొంత వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని, మిగిలినది 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల సమయంలో ఇస్తానని చెప్పారని.. అయితే ఇప్పుడు తనకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోవడంతో పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu