పొరపాటున వేసిన బాంబు.. 100 మంది మృతి

 

పొరపాటున ఉగ్రవాదులు మీద వేయాల్సిన బాంబును కాస్త ప్రజలపై వేయడంతో దాదాపు 100 మంది పైగా మృతి చెందారు. ఈ దారణమైన ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నైజీరియాలోని కామెరూన్‌ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌ విమానం ఉగ్రవాదులపై బాంబు దాడులు జరుపుతుంది. దీనిలో భాగంగానే పొరపాటున ఉగ్రవాదుల మీద వేయాల్సిన బాంబు కాస్త స్థానిక శరణార్థుల శిబిరంపై బాంబును వేశారు. దీంతో 100మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు.