ప్రమాణానికి సిద్ధం.. లోకేష్ ప్రతిసవాల్!

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ కు మంత్రి లోకేష్ స్పందించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని విజిలెన్స్ నివేదిక, ల్యాబ్ రిపోర్ట్ నిర్ద్వంద్వంగా తేల్చేశాయనీ, అయినా దేవుడి విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెర్డి సవాల్ ను స్వీకరిస్తున్నాననిలోకేష్ అన్నారు.  తాను తిరుపతిలోనే ఉన్నానని,  ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు.  ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని, తిరుమల పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు.