ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి

 

నల్లమల అడవుల్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొక మావోయిస్టు గాయాలతో పారిపోయాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్లకు సమీపంలోని అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో జానా బాబూరావుతోపాటు మరో ఇద్దరు మహిళలు విమల, భారతి మరణించారు. విక్రమ్ అనే మావోయిస్టు గాయాలతో తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల క్యాట్‌పార్టీ, ఏఎన్‌ఎస్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. అరగంట సేపు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో మావోయిస్టు సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలంలో నాలుగుకిట్లుతోపాటు ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక ఏకే 47, విప్లవ సాహిత్యం దొరికాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన జానా బాబూరావు ప్రస్తుత కేంద్రకమిటీ అగ్రజుడైన ఆర్కేకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu