మంత్రి మల్లారెడ్డికి క‌రోనా పాజిటివ్‌

తెలంగాణలో ప్రజాప్రతినిధులను క‌రోనా వైర‌స్ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీక‌ర్‌, పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడగా.. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కూడా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా ప‌రీక్ష‌ల్లో మ‌ల్లారెడ్డికి పాజిటివ్‌ గా నిర్ధారించారు వైద్యులు. దీంతో.. అయన సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక‌, మ‌ల్లారెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెలిగిన‌వారిని గుర్తించి క‌రోనా ప‌రీక్ష‌లు చేసేప‌నిలో ఉన్నారు అధికారులు.