కవిత కోసం బిజెపిలో బిఆర్ఎస్ విలీనం ? 

బిఆర్ఎస్ నేతలు  కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను  పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ  అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది. కవితను తీహార్ జైల్లో పరామర్శించిన తర్వాత బావా బామ్మర్దులు ప్రధాని అపాయింట్ మెంట్ కోసం వేచిచూశారు. ప్రధాని కార్యాలయం వీరిరువురికి అపాయింట్ ఇవ్వలేదు. వరుసగా పదేళ్లు తెలంగాణలో  అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలకు అపాయింట్ మెంట్ దొరకకపోవడం చర్చనీయాంశమైంది. అవమాన భారంతో కుమిలిపోతున్న బిఆర్ఎస్ నేతలు ఇక బిజెపి నేతలతో చర్చలు జరపాలని  నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించడానికి కెసీఆర్ సూచన మేరకు  బిఆర్ఎస్ నేతలు బిజెపి నేతలతో చర్చలు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్ ను కెటీఆర్, హరీష్ రావులు కలిసారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలను భారీ స్థాయిలో చేర్చుకోవడం కెసీఆర్ ను ఆందోళనకు గురి చేస్తోంది.  రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించకపోతే తమ పార్టీని బిజెపిలో విలీనం చేస్తామని డికెతో బిఆర్ఎస్ నేతలు హెచ్చరించినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. ఎపిలో టీడీపీ కూటమి మాదిరిగా తెలంగాణలో  కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతమ్ చేయడానికి  బిజెపిలో బిఆర్ఎస్ కల్సి పని చేయాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే బిజెపిలో  బిఆర్ ఎస్ విలీనం చేసే ప్రయత్నాలు  కెసీఆర్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ అయిన కవిత తీహార్ జైలులో 110 రోజులు దాటడంతో కెసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెయ్యి కోట్ల రూపాయలు అయినా ఇచ్చి కవితకు బెయిల్ దొరికే విధంగా ప్రయత్నాలు చేయాలని కెసీఆర్ సూచించినట్టు చర్చ జరుగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో జీరోకి పడిపోయింది. ఢిల్లీ పెద్దలు బిఆర్ఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో స్వయంగా కెసీఆర్ ప్రధానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవితను విడిపించుకునే క్రమంలో బిఆర్ఎస్ ను బిజెపిలో విలీన ప్రతిపాదనను కెసీఆర్ ప్రధాని ముందు ఉంచినట్టు తెలుస్తోంది.