పెళ్ళి వాహనాలకు ప్రమాదం... 14 మంది మృతి

 

ఉత్సాహంతో పెళ్ళికి వెళ్తున్న పెళ్ళి బృందాల వాహనాలు ప్రమాదానికి గురి కావడంతో 14 మంది మరణించారు. ఈ ఘటనలు ఛత్తీస్‌గఢ్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బలోడ్ జిల్లాలో ఒక పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న వ్యాను లారీని ఢీకొనడంతో ఒక బాలిక సహా 10 మంది అక్కడికక్కడే మరణించారు. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఒకపెళ్ళి వాహనం ప్రమాదానికి గురైంది. పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu