స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిచాలని, రిజర్వేష్లన్లు 50 శాతం కుదిస్తూ ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపింది. నివేదిక అందిన మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గత ఏడాది స్థానిక సంస్థల నిర్వహి ప్రత్యే అధికారుల పాలనలో ఉంది. స్థానికల సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ గత సంవత్సరం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.