తమిళ రాజకీయాల్లోకి కృష్ణంరాజు..?

తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసిన తర్వాత..కొత్త గవర్నర్ ఎవరు..? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి..ఈ పదవి కోసం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావుకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు పేరు తెరమీదకు వచ్చింది. ఆయనను కేంద్రం తమిళనాడు గవర్నర్‌గా నియమించబోతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రెబల్‌స్టార్ రాజకీయాలు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు.