ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన మరో పెను ప్రమాదం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొద్ది రోజుల క్రితం రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టినంత పనిచేసి అధికారులను పరుగులు పెట్టించిన సంఘటన మరచిపోకముందే తాజాగా ఇవాళ మరో పెను ప్రమాదం తప్పింది.  బెంగళూరు నుంచి ఢిల్లీకి బయల్దేరిన స్పైస్ జెట్ విమానానికి హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా ల్యాండింగ్ సమస్య తలెత్తింది. అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది.