మీడియా స్వేచ్చకు భంగం కలిగించకూడదు: కిషన్ రెడ్డి

 

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందిస్తూ “ఈ వ్యవహారంలో కేంద్రం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తున్నాను. కేంద్రం తన పరిధిలో తన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయమనం పాటించడం చాలా అవసరం. ఇరువురు కూడా తమతమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని నా అభిప్రాయం. పత్రికా స్వేచ్చకు భంగం కలిగించడం మంచి పద్ధతి కాదు. తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి ఛానల్ పై నిషేధం విదించడాన్ని ఖండిస్తున్నాను. అదే సమయంలో మీడియా కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, తమ స్వంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింపజేయాలని అప్పుడే ప్రజలకు కూడా మీడియాపై నమ్మకం కోల్పోకుండా ఉంటారని అన్నారు. రాజకీయ పార్టీలు మీడియా చానెల్స్‌ను పెట్టి నడిపించడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు.