గూడ్స్.ని ఢీకొన్న భాగమతి ఎక్స్.ప్రెస్!
posted on Oct 12, 2024 10:02AM
భాగమతి ఎక్స్.ప్రెస్ చెన్నై సమీపంలో ఆగివున్న గూడ్స్ ట్రైన్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 కోచ్లు పట్టాలు తప్పాయి. రెండు బోగీలు కాలిపోయాయి. పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా దర్భంగా వెళ్లాల్సిన భాగమతి ఎక్స్.ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 13 కోచ్లు పట్టాలు తప్పాయి. కొన్ని కోచ్లు చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని కోచ్లు ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. రెండు కోచ్లో కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇంత దారుణమైన ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ మరణించలేదు. పది మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును భాగమతి ఎక్స్.ప్రెస్ ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. వారందరినీ సమీపంలో వున్న ఆస్పత్రులకు తరలించారు.