శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై  శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  . శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన  ఆశ్వయుజ సుద్ధ షష్ఠి  మంగళవారం (అక్టోబర్ 8)   కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా  అధికారులు చేసిన ఏర్పాట్లు ప్రశంసలందుకుంటున్నాయి.