ఇండియాతో చర్చలకు పాకిస్తాన్ నో!

భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలకు పాకిస్థాన్ నో చెప్పింది. ఇస్లామాబాద్ వేదికగా ఈ నెల 15, 16 తేదీలలో  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో  పాక్ ఈ ప్రకటేన చేయడం గమనార్హం.  షాంగై సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఎటువంటి చర్యలూ ఉండబోవని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.