చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం....

 

సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మందిని మట్టుబెట్టిన భారత సైన్యం ఇప్పుడు తాజాగా చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ఉగ్ర‌వాదులు ప్రయత్నించారు. వెంటనే  ప‌సిగ‌ట్టిన భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల‌పై కాల్పులు జ‌రిపాయి. దీంతో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ప్ర‌స్తుతం కాల్పులు కొనసాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu