వైఎస్ జగన్ ను నాంపల్లి కోర్టుకు తరలించిన సిబిఐ

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు సోమవారం ఉదయం దిల్కుశ అతిథిగృహం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించారు. అంతకు ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 ప్లాటూన్లను రంగంలోకి దింపారు. కాగా ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆంక్షలు పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu