సీఎం చొక్కా.. మంత్రి నిక్కరు విప్పుతా...

 

నంద్యాల ఉపఎన్నిక ప్రచారం మంచి జోరుగానే సాగుతుంది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పెద్ద మాటల యుద్దమే జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే రెచ్చిపోయి మరీ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడిని కాల్చి పారేయాలని... ఉరితీయాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జగన్... మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రచారంలో పాల్గొన్న జగన్... మరో రెండేళ్లు ఆగితే ముఖ్యమంత్రి చంద్రబాబు చొక్కా, మంత్రి ఆదినారాయణ రెడ్డి నిక్కరు విప్పుతానని అన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి స్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.850 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారని.. ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా ఆయన ఎగ్గొట్టారన్నారు. ఈ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాల్సిన చంద్రబాబు తాను చెప్పిన మాట వినే సీఐడీ విచారణకు ఆదేశించారని విమర్శించారు. మరో రెండేళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రభుత్వమే అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులకు డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికే జగన్ పై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు.. దీనిపై ఎలా స్పందిస్తారో చూద్దాం.