సైకో సాంబ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభ్యం

సైకో సాంబశివరావు పరారీలో పోలీసులకు కీలక ఆధారం లభించింది. గత మూడు రోజులుగా కొండపల్లి ఖిల్లాను జల్లెడవేస్తున్న పోలీసులుకు ఓ ప్రాంతంలో సాంబశివరావు కాలికి వేసిన గొలుసులు లభ్యమయ్యాయి. గొలుసు దొరికి ప్రాంతంలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. బండరాయితో గొలుసును కొట్టి తప్పించుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గొలుసును తెంపుకున్న సైకో కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకుని చుట్టు ప్రక్కల గ్రామాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ సైకో కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu