బెంగళూరులో ‘గీతా శంకరం’ రెగ్యులర్‌ షూటింగ్‌!

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంకశర్మ జంటగా రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం  ‘గీతా శంకరం’. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ బెంగళూరులో జరుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్‌గా సాంగ్స్‌ రికార్డింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్‌ మాట్లాడుతూ... కంటెంట్‌ ఉంటే చిన్న చిత్రమైనా, పెద్ద చిత్రమైనా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు. ఒక మంచి కంటెంట్‌తో మా ‘గీతా శంకరం’ సినిమాని నిర్మిస్తున్నాము. ఎమోషనల్‌ డ్రామాతో ప్యూర్‌ లవ్‌ స్టోరీగా జరిగే  కథ  ఇది. ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరులో షెడ్యూలు జరుపుకుంటుంది. అలాగే  మా చిత్రంలోని పాటలన్నిటిని రీసెంట్‌గా రికార్డింగ్‌ చేయడం జరిగింది.  త్వరలో   లిరికల్‌  వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు  చేస్తున్నాం’ అన్నారు
 
దర్శకుడు రుద్ర మాట్లాడుతూ... ‘ప్రజెంట్‌ యూత్‌ సినిమా చూసే విధానం మారింది. కొత్తదనం ఉంటే పెద్ద విజయాన్ని అందిస్తున్నారు. అందుకే చాలా కొత్త పాయింట్‌తో, స్క్రిప్టులో అనేక మార్పులు చేసి ఇంకా అధ్బుతంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దేవానంద్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా అద్భుతంగా రావటానికి నాతోపాటు కష్టపడుతున్న ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్స్‌కు నా కృతజ్ఞతలు. త్వరలో మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం’ అన్నారు.