శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

కాగా బుధవారం శ్రీవారిని 69వేల 365 మంది దర్శించుకున్నారు. 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.05 కోట్ల  రూపాయలు వచ్చింది.

గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu