తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4.27 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మార్చి 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక ఆదివారం (మార్చి 23) శ్రీవారిని 67 వేల 284 మంది దర్శించుకున్నారు. వారిలో 19 వేల 064 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానులక ఆదాయం 4 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.