తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం(జూన్ 1) శ్రీవారిని 62వేల 407 మంది దర్శించుకున్నారు.

33 వేల 895 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.56 కోట్ల రూపాయలు వచ్చింది.

ఇక శుక్రవారం(జూన్ 2) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తల క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ వచ్చింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.