కొండా సురేఖస్టేట్ మెంట్ రికార్డు చేయనున్న కోర్టు 

మంత్రి కొండాసురేఖపై మాజీ మంత్రికెటీఆర్ వేసిన పరువు నష్టం కేసు బుధవారం విచారణకు రానుంది . క్రిమినల్ కోర్టులో కెటీఆర్ వేసిన 100 కోట్ల పరువు నష్టం కేసు ఈ నెల 23న విచారణకు రానుంది.  నాగార్జున  కొడుకు నాగచైతన్య , సమంతతో విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం కెటీఆర్ అని  కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే . ఈ కేసులో కొండా స్టేట్ మెంట్ ను బుధవారం క్రిమినల్ కోర్టు రికార్డు చేయనుంది ఇప్పటికే సమంతకు  క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ కెటీఆర్ మీద సీరియస్  గానే ఉన్నారు. తన ఆరోపణలు వెనక్కి తీసుకోవడం లేదని కొండా సురేఖ తేల్చేసి చెప్పేశారు  . దీంతో కెటీఆర్ పరువు నష్టంతో బాటు క్రిమినల్ కేసును కొండాపై వేశారు ఇప్పటికే రెండు విచారణలు జరిపిన కోర్టు కొండా స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ చేపట్టనుంది నాగార్జున వేసిన పరువు నష్టం దావా వెనక కెటీఆర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున  స్టేట్ మెంట్ ఇప్పటికే   రికార్డు చేసిన సంగతి తెలిసిందే