ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. మరొకరు మృతి

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 10,240 శాంపిల్స్ ను పరీక్షించగా 44మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.  అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,621కు చేరింది. గత 24 గంటలలో కృష్ణా జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య మొత్తం 56కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1848 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 767 మంది చికిత్స పొందుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu