కృష్ణా జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్

ఏపీ మొత్తంలో కృష్ణా జిల్లాలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23 కు పెరగడంతో, జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. విజయవాడలో 15 కేసులు, రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. జగ్గయ్యపేటలో ఇద్దరికి పాజిటివ్ గా తేలటంతో, ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు.