చంద్రబాబు పీఎం, లోకేష్ సీఎం.. వైవీబీ జోస్యం

మచిలీపట్నంలో టీడీపీ కృష్ణాజిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుందని, 2024లో నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాన మంత్రి, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ను నియమించాలని ఈ విషయాన్ని సభా పూర్వకంగా తీర్మానించాలని కోరారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేసునందుకే ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రులయ్యారని అన్నారు.