అనుష్క నడుంపై కోహ్లీ.. యువీ ఎదుటే
posted on May 18, 2015 11:35AM

అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి కారణం వీరిద్దరే అని అందరూ తిట్ల వర్షం కూడా కురిపించారు. ఇప్పుడు కొత్తగా మరో వివాదంలో ఇరుక్కున్నారు ఈ జంట. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ జరిగే సమయంలో తోటి ఆటగాళ్లతో, మ్యాచ్ అధికారులతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు ఇది నిబంధన. అయితే మన హీరో విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రేయసి కోసం నిబంధనలను అతిక్రమించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత అనుష్క శర్మను దగ్గరకు రమ్మని పిలిచి ఇద్దరూ మాట్లాడుకున్నారు. అదే సమయంలో యువరాజ్ సింగ్ కూడా పక్కనే ఉన్నా.. విరాట్ మాత్రం అనుష్క శర్మ నడుపై చేయి వేసి మరీ మాట్లాడాడు. దీంతో మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నా అందరి చూపులు మాత్రం ఈ జంటపైనే పడ్డాయి.