ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ  మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరూ  కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు  ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో   చేరిపోయారు. ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు , బస్వ రాజు సారయ్య అర్థరాత్రి దాటిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటివరకు మండలిలో  బిఆర్ఎస్ బలంగా ఉంది. బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు  ఆరుగురు ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీల వలస కెసీఆర్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.