తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  సోమవారం (జులై 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (జులై 7) శ్రీవారిని మొత్తం 78 వేల 912 మంది దర్శించుకున్నారు.

వీరిలో 32 వేల 039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 83 లక్షల రూపాయలు వచ్చింది.