వేడి నీళ్లు తాగితే...

పానం అనగానే కొందరికి ఇదేమైనా పానం అనగానే తాగేది అన్న భావనలోకి వెళ్లి పోతారు. అయితే ఇది మీరు అనుకున్న పానం కాదు.  అసలు పానం అనగానే మందు అన్న అర్ధం చేసుకోవచ్చు అయితే ఆయుర్వేదం లో పానం చరక సంహితలో నిషి ఉష్ణోదక పానం గురించి చెప్పారు.నిషి ఉష్ణోదక పానం తో చికిత్చ చేయవచ్చునని ఇది మనకు ఋషులు భోదించిన 1౦౦౦ సంవత్సరాల కాలం నాటి చికిత్సగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ టి.వేణుగోపాల్ తెలుగు వన్ న్యూస్ కు తెలిపారు. ఆయుర్వేదంలో రోగాలకు చికిత్స తో పాటు రోగాలు రాకుండా కాపాడుకునే ప్రాముఖ్యత ముఖ్యమని నిషి ఉష్ణోదక పానం గురించి చరక సంహితలో పేర్కొన్నారు.అయితే నిషి ఉష్ణో దక పానం మనకు ఒక రూపాయి ఖర్చుకూదాలేదు. ఇది ఆరోగ్య చిట్కా అని అంటారు ఓజస్ ఆయుర్వేద ఆసుపత్రికి చెందిన ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ టి వేణుగోపాల్ తెలిపారు.

నిషి ఉష్ణో దక పానం కేవలం రోజూ మనం తీసుకునే మంచి నీళ్ళే అయితే నిషి ఉష్ణోదక పానానికి ఆర్ ఓ వాటర్ గాని మినరల్ వాటర్ వాడరాదని అన్నారు డాక్టర్ వేణుగోపాల్.ఈ మందు తయారీకి కేవలం బోర్ వెల్ వాటర్ లేదా నల్ల లో వచ్చే మంచినీళ్ళు చాలా బాగా పనిచేస్తాయని నిషి ఉష్ణోదక పానం సేవనం అంటే తాగడం వాళ్ళ మంచి ఆరోగ్యలభాలు ఉన్నాయి. అని అంటున్నారు వేణుగోపాల్ గారు. నిషి

ఉష్ణోదక పానం తయారి ఎలాచేయాలి...

బాగా కడిగి శుభ్రం చేసిన గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని అరగ్లాసు వచ్చే వరకు బాగా మరగ పెట్టండి.లేదా మీకు ఇంకా ఎక్కువ నీళ్ళు తాగాలని ఉంటె రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒక గ్లాసు  అయ్యేంతవరకు మరగనివ్వాలి.అందులో 1/4 వంతుకు మరగ పెట్టవచ్చు.అలా బాగా 1/2 భాగం మరగనివ్వవచ్చు.

నిషి ఉష్ణోదక పానం ఎప్పుడు తాగవచ్చు...

పాడుకోడానికి ముందు అంటే రాత్రి ఆహారం తీసుకున్నాక రెండు లేదా మూడు గంటల  తరువాత తాగ గలిగిన నీటిని గోరువెచ్చగా తాగాలి.అలా తీసుకున్న నిషీ  ఉష్ణో దక పానం.అద్భత ఫలితాలు ఇస్తుంది.
ఈ ఉష్ణోదక పానం తీసుకోవడం వల్ల పొట్టలో పేరుకు పోయిన మలం కడుయ్తులు తుంది. మల బద్ధకం,సమస్యనుండి విముక్తి లభిస్తుంది,పేగులలో పేరుకు పోయిన మలినాలు పోతాయి కడుపు పూర్తిగా క్లీన్ అయిపోతుంది.క్రమం తప్పకుండా తీసుకోవడం డైట్ లో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం లేదు. నిషి ఉష్నోడక పానం వల్ల ఆకలి పెరుగు తుంది.జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగు తుంది.

మీరు ఒబెసిటి తో బాధ పడుతున్నారా?...

మీరు ఊబాకాయం తో బాధ పడే వారికి వేడి నీళ్ళు మీ కొవ్వును కరిగిస్తుంది.మీశారీరంలో పేరుకు పోయిన కొవ్వు తగ్గి శరీరం నాజూకు గా తాయారు అవుతారు. కొలస్ట్రాల్ లేదా లిపిడీ మియా ఎల్ డి ఎల్.లేదా హెచ్ డి ఎల్ తగ్గుతుంది.దీనికోసం నూనెలు మార్చాల్సిన అవసరం లేదు. మందుల వాడకం తగ్గించ వచ్చని నిషి ఉష్ణో దక పానం ఈ సమస్యకు మేలైన పరిష్కారమని పేర్కొన్నారు. తుమ్ములు,ముక్కు కారడం,జలుబు,శ్వాస సంబందిత సమస్య లకు,బ్రోంకై టిస్ తో ఉన్నవాళ్లు వేడి నీళ్ళు తాగితే పొడి దగ్గు సమస్య శ్లేష,కఫ ,పిత్త వాత సమస్యలు తగ్గుతాయి.ఖర్చులేని నిషీ ఉష్ణోదక పానం వాళ్ళ ఆమ్లాలు సరిగా ఉంటాయి.

నిషి ఉష్ణోదక పానం రాత్రి మాత్రమే ఎందుకు తీసుకోవాలి...

రాత్రి పూట వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం ఉషారుగా తాయారు అవుతుంది.రాత్రి పడుకునే వరకు అలిసిపోరు. పైగా నీరసం రాదు.రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. చర్మం లో ముడతలు పోయి.చర్మం నిగారింపు వస్తుంది..అన్ని రకాల అనారోగ్యాలకు ఒకే మందు నిషీ ఉష్ణోదక పానం తో మేలైన లాభాలు. ఇప్పటి నుంచే ఖర్చులేని  వేడి నీటిని తాగండి మంచి ఫలితాలు చూడండి.