బాపు చిత్రాలకు ఎడిటర్ కె.ఎన్. రాజు మృతి..

బాపు చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన కె.ఎన్. రాజు(65) చెన్నైలో కన్ను మూశారు. గత కొద్దికాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కాగా  కె.ఎన్. రాజు తమిళనాడులోని పాళయంకోట్టై లో జన్మించారు. ఈయన పలు తెలగు, తమిళ భాషలకు చెందిన అనేక సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో బాపు సినిమాలు మిస్టర్ పెళ్లాం, రాంబంటు, పెళ్లి కొడుకు, రాధా గోపాళం చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu