ఏపీ రాజధానికి వృద్ధురాలు కోటి విరాళం..
posted on Feb 4, 2016 4:58PM

కనీసం ఒక్క రూపాయి పక్కన వాళ్లకు ఇవ్వాలంటే ఆలోచించే ఈ రోజుల్లో ఏపీ నూతన రాజధానికి విరాళం ఇచ్చి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఓ వృద్దురాలు. ఆమె ఇచ్చింది ఏ వేలో.. లక్షలో అనుకుంటే పొరపాటే. ఏకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. తక్కెళ్ల పాడుకు చెందిన ముప్పవరపు స్వరాజ్యం అనే వృద్దురాలు ఏపీ రాజధాని నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చింది. ఇప్పటికే ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశానని.. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోటి రూపాయలను అందజేస్తానని తెలిపారు. అంతేకాదు తెలుగు జాతి గర్వపడేలా రాజధాని నిర్మించడం అభినందనీయమని.. సీఎం చంద్రబాబు కృషిని అభినందిస్తున్నానని అన్నారు. మరి ప్రధాని అంతటి వ్యక్తే కనీసం ఏం విరాళం ప్రకటించకుండా ఒక మట్టికుండ.. ఒక చెంబుడు గంగాజలం తీసుకొచ్చి ఇచ్చారు. అలాంటి ప్రధాని కంటే ఈ వృద్ధురాలు చాలా బెటర్ అనిపిస్తోంది.