ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్

 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,  మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. మరోవైపు 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి  కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి వస్తాయని పేర్కొంది. 

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నోటిఫికేషన్‌ వెలువడింది. మార్పుల్లో నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్‌కు మార్చారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్‌కు మారుస్తూ ఏపీ సర్కార్ కీలక మార్పులు చేసింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాల సరిహద్దులను మార్చారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu