మే 7 తర్వాతే మున్సిపల్ ఫలితాలు: సుప్రీం

 

 

 

మే నెల 7వ తేదీ తర్వాతే మునిసిపల్ ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు ఈనెల 9న విడుదల చేయడానికి ఎన్నిక సంఘం సన్నాహాలు చేస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది. ఈవీఎంలను భద్రపరచలేమన్న సాకుతో ఎన్నికల ఫలితాలను ముందే ప్రకటించడం మంచిది కాదని సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది.