మోడీ గొంతుకి ఏమైంది?

 

 

 

భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గొంతు బొంగురుపోయింది. ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పటి నుంచి నరేంద్ర మోడీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే వున్నారు. రోజుకి అయిదారు బహిరంగ సభల్లో మాట్లాడుతూనే వున్నారు. ఇంకా పార్టీ మీటింగ్స్ లో, తనను కలవటానికి వచ్చేవారితో మాట్లాడ్డం అదనం. సోమవారం నాడు బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ మాట్లాడినప్పుడు ఆయన గొంతు బొంగురుపోయి వినిపించింది. మాట్లాడేది నరేంద్ర మోడీయేనా అనిపించేలా ఆయన గొంతు మారిపోయింది. ఎన్నికల ప్రచారం మరింత వేడి పుంజుకుంటున్న సమయంలో మోడీ గొంతు బొంగురుపోతూ వుండటం పట్ల భాజపా శ్రేణులు కలవరపడుతున్నాయి. మోడీ గొంతులోంచి వచ్చే తూటాల్లాంటి మాటల ప్రభావం గొంతు పాడవటం వల్ల తగ్గిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. మోడీ దీని నివారణకు తగిన వైద్య సహకారం తీసుకోవాలని కోరుకుంటున్నారు.