ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల

 

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను గురువారం నాడు కాకినాడ జేఎన్‌టీయు‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు సంబంధించిన మార్కులు, ర్యాంకులను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్, కాకినాడ ఎంపీ తోట నర్సింహం తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ, అనుకున్నదానికంటే 5 రోజుల ముందుగానే ఎంసెట్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు.