ఢిల్లీ సాక్షిగా కేంద్రాన్ని రచ్చకీడుస్తున్న చంద్రబాబు

 

రాష్ట్రంపై కేంద్రం కుట్రలను ఢిల్లీ వేదికగా విన్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు.కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్ అంశాలు,తిత్లీ తుఫానుపై కేంద్రం స్పందన లేకపోవటంపై ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని నిలదీయనున్నారు.ఓవైపు రాష్ట్రంలో తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయమని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.కానీ కేంద్రం తుఫాను పై స్పందించలేదు.మరోవైపు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి కూడా తెలిసిందే.దీనిపై గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీని నివేదిక సమర్పించమని ఆదేశించారు.దీనిపై కూడా చంద్రబాబు ఘాటుగా స్పందించారు.గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశాలపై కేంద్రాన్ని రచ్చకీడ్చి దేశ ప్రజలకు కేంద్ర వైఫల్యాన్ని చాటిచెప్పేందుకు ఢిల్లీని వేదికగా ఎంచుకున్నారు.