ఏపీ అసెంబ్లీ సమావేశాలు... ప్రోటెం స్పీకర్ గా పతివాడ ప్రమాణం

 

 

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రోటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్ భవన్ లో పతివాడ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ మధ్యాహ్నం 11.52 గంటలకు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపి సభ వాయిదా పడనుంది. 20వ తేదీన స్పీకర్ ఎన్నిక, 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. సభ తిరిగి 23న ప్రారంభమవుతుంది. ఆరోజుగవర్నర్ ప్రసంగానికి సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తారు. చివరి రోజైన 24వ తేదీన సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. 21 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu