ఏపీ రాజధాని: ముహూర్తం మంచిది కాదట!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించిన ప్రకటనను గురువారం మధ్యాహ్నం 12:57కి రాష్ట్ర శాసనసభలో ప్రకటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మంచిది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు అంటున్నారు. దశమి తిథితో కూడిన గురువారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు శని హోరం ఉంటుందని, అంటే మరో రకంగా చెప్పాలంటే వర్జమని, ఆ సమయంలో ముహూర్తం మంచిది కాదని ఎప్పుడు నేర్చుకున్నారోగానీ ఆయన పంచాంగం చెపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని, దానివల్ల సఫలం కాలేకపోయారని ఆయన ఉదాహరణ కూడా వివరించి చెపుతున్నారు.