సంగీత విద్వాంసులపై స్టాంపుల విడుదల

 

ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులపై స్మారక స్టాంపులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రఖ్యాత భారతీయ సంగీత విద్వాంసులు పండిట్ రవిశంకర్, పండిట్ భీమసేన్ జోషి, డి.కె.పట్టమ్మాళ్, పండిట్ మల్లికార్జున్ మన్సూర్, గంగుబాయి హంగల్, పండిట్ కుమార్ గంధర్వ, ఉస్తాద్ విలియత్ ఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్‌ల స్మారక స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు.