గోదావరి పుష్కరాల లోగో

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి జూన్ 6వ తేదీన భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. ఆరోజు ఉదయం 8.49 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ, శంకుస్థాపన చేస్తారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. అలాగే పుష్కరాలకు సంబంధించిన లోగోను విడుదల చేశామని కూడా ఆయన తెలిపారు. 198 ఎంట్రీలను పరిశీలించాక పుష్కరాల లోగోను ఎంపిక చేశామని వివరించారు. ఈసారి గోదావరి పుష్కరాలను మహా పుష్కరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఈ లోగోను అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగిస్తారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంద్రబాబు ఆహ్వానిస్తారని తెలిపారు. పుష్కరాల లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు.